8th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్.. జీతాలు మళ్లీ పెరిగే చాన్స్, ఎందుకో తెలుసా ?

ప్రతి పదేళ్లకోసారి సెంట్రల్ పే కమిషన్ ఏర్పడుతుంది. 8వపే కమిషన్ పై అప్డేట్ ఏంటో తెలుసుకోండి.

8th Pay Commission : ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులు, పెన్షనర్లు (Pensioner’s) అందరూ ఎదురుచూస్తున్నారు. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి అందినట్లు తెలుస్తోంది. 8వ వేతన సంఘం ఏర్పాటులో కీలక అడుగు వేసినట్టు తెలుస్తుంది. కాబట్టి, ఎనిమిదవ వేతన సంఘం యొక్క ప్రయోజనాలు ఏమిటి? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి పదేళ్లకోసారి సెంట్రల్ పే కమిషన్ (Central Pay Commission) ఏర్పడుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాలు మరియు ప్రోత్సాహకాలను క్రమం తప్పకుండా విశ్లేషించి తీర్పులు ఇస్తుంది. ఉద్యోగుల డీఏ (employees DA)పెంపుదల వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉంటుంది. 3వ, 4వ, 5వ వేతన సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందించే వేతనాలు, అలవెన్సులు మరియు సేవలను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపాయి.

8th Pay Commission

తాజాగా ఇండియన్ రైల్వేస్ (Indian Railways) టెక్నికల్ సూపర్ వైజర్స్ అసోసియేషన్ (Indian Railways Technical Supervisors Association) కేంద్రానికి రాసిన లేఖలో కొన్ని డిమాండ్లు చేసింది. కొత్త సెంట్రల్ పే కమిషన్‌ను ఏర్పాటు చేయాలనేది మొదటి డిమాండ్. ఇతర విషయాలతోపాటు, వివిధ రకాల ఉద్యోగుల మధ్య వేతనాలు మరియు జీత భత్యాలలో అసమానతలను పరిష్కరించాలి.

8వ వేతన సంఘం ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, జీతాల పెంపుపై డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగ వర్గాలలో జీత భత్యాలు మరియు ఇతర ప్రయోజనాలలో అసమానతలను సరిచేయడానికి కొత్త పే కమిషన్ అవసరం. ఉద్యోగి జీతం, అలవెన్సులు, పని పరిస్థితులు మరియు ప్రమోషనల్ ప్రమాణాలను నియంత్రించే నిబంధనలు తప్పనిసరిగా రైల్వే టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాసిన లేఖ ద్వారా జారీ చేయాలి. 8వ వేతన సంఘం ఏర్పాటు వల్ల వీటన్నింటికీ మార్గం అని లేఖలో పేర్కొన్నారు.

8th Pay Commission

Comments are closed.