Char Dham Yatra : దేవభూమి లేదా దేవతల భూమికి నిలయం అని పిలిచే ఉత్తరాఖండ్ (Uttarakhand), ఎన్నో దేవాలయాలు మరియు పవిత్ర స్థలాలతో ఏడాది పొడవునా యాత్రికులను ఆకర్షిస్తుంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ అనే నాలుగు పవిత్ర స్థలాల సందర్శనలను కలిగి ఉన్న చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)అత్యంత ప్రసిద్ధ తీర్థయాత్రలలో ఒకటి.
2024లో ఉత్తరాఖండ్లో చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభం కానుంది. ఈ యాత్రను ప్రారంభించాలనుకునే భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, మేలో రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ముగిశాయి, 16 లక్షల మంది భక్తులు రిజర్వ్ చేసుకున్నారు. ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ రోజువారీ నమోదు పరిమితులను ఏర్పాటు చేసింది.
కేదార్నాథ్ యాత్రకు ప్రతిరోజు 18,000 మంది భక్తులు ఉండగా, బద్రీనాథ్ యాత్రకు 20,000 మంది భక్తులు ఉన్నారు. అదేవిధంగా, గంగోత్రికి 11,000 మరియు యమునోత్రి ధామ్కు 9,000 భక్తులు దర్శించుకోవచ్చని రోజువారీ పరిమితులు ఉన్నాయి.
మేలో రిజిస్ట్రేషన్లు (Registrations) పూర్తిగా బుక్ కావడం మరియు హెలి సేవ (హెలికాప్టర్ సేవలు) అధిక డిమాండ్తో, భక్తులు ఇప్పుడు జూన్లో దర్శించుకునేందుకు ముందుగానే బుక్ చేసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెలీ సేవా కార్యక్రమం, రికార్డు స్థాయి బుకింగ్ల ద్వారా చాలా విజయవంతమైంది.
ముఖ్యంగా, మే మరియు జూన్లలో కేదార్నాథ్కి (Kedarnath)వెళ్లే హెలీ సేవా టిక్కెట్లు ఇప్పటికే ముగిసాయి. ఇంకా, సెప్టెంబరు మరియు అక్టోబర్లలో గణనీయమైన మొత్తంలో టిక్కెట్ బుకింగ్లు పూర్తయ్యాయి.
భక్తులు భారీగా తరలివస్తే వారిని నిలువరించేందుకు త్రిషికేశ్లో (Trishikesh) ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తరాఖండ్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రకారం, బద్రీనాథ్ను (Badrinath) సందర్శించాలనుకునే వారు ముందుగా శ్రీనగర్లో కి వెళ్ళాలి. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే రాత్రికి శ్రీనగర్లోనే బస చేయాలి. మరుసటి రోజు రుద్రప్రయాగ్, చమోలి, పిప్పల్కోటి మరియు జోషిమఠ్లలో యాత్ర జరుగుతుంది.
మే 10న చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుండగా, మొదటి 15 రోజుల్లో 10 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మే 10 మరియు మే 25 మధ్య VIPల సందర్శనను మానుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు.
చార్ ధామ్ యాత్రలో ముందుగా యమునోత్రి ధామ్
చార్ ధామ్ యాత్ర యమునోత్రితో ప్రారంభం అవుతుంది. ఇది పశ్చిమాన మొదలయ్యి తూర్పున ముగుస్తుంది. అందుకే ముందుగా యమునోత్రితో ప్రారంభిస్తారు. యమునోత్రి ధామ్ దర్శనం పూర్తి కాగానే గంగోత్రి ధామ్ ని దర్శించుకోవాలి. ఇది దాదాపు 220 కీ.మీ ఉంటుంది. గంగోత్రి ధామ్ ని దర్శించుకుంటే పాపాలన్నీ తొలిగి పోతాయని నమ్ముతారు. ఆ తర్వాత కేదార్ నాధ్ ను దర్శించుకుంటారు.
ఇప్పటికీ ఇక్కడ శివుడు(God Shiva) ఉంటాడని పురాణాలూ చెబుతాయి. ఏ కోరికలు అయిన నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ తర్వాత, అలకనంద ఒడ్డున విష్ణు ధామం ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో ఉంది. బద్రీనాథ్ ధామ్ దర్శించుకుంటే అన్ని పాపాలు తొలిగి జీవితం సాఫీగా కొనసాగుతుందని నమ్ముతారు. చార్ ధామ్ యాత్ర ఒక పవిత్రమైన యాత్ర. దీన్నీ చేరుకోడానికి రోడ్ (Road) , ఫ్లైట్ (Flight) , ట్రైన్ మార్గాల (Train Ways) ద్వారా వెళ్ళవచ్చు. అక్కడ హిమాలయ అందాలను చూడవచ్చు.