Hyderabad Water Problem, Useful News : 2024 లో భాగ్యనగరానికి నీటి కష్టాలు తీరినట్లే.. హమ్మయ్య ఇక సమస్య ఉండనట్టేనా!

హైదరాబాద్ వాసులకు నీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నగరంలో చాలా మంది వ్యక్తులు నీరు లేదా ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు.

Hyderabad Water Problem : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్నారు. భూగర్భ జలాలు ఎండిపోవడంతో పలు ప్రాంతాలు నీటి కొరతకు గురవుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) వాసులకు నీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నగరంలో చాలా మంది వ్యక్తులు నీరు లేదా ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో రూ .500 ఉండే ట్యాంకర్లు ఇప్పుడు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు రూ. 1000 మరియు రూ. 1400 వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్ వాటర్ బోర్డు దృష్టి

కాగా, నీటి సమస్యపై హైదరాబాద్ వాటర్ బోర్డు దృష్టి సారించింది. నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాంతో,  నాగార్జునసాగర్ నుండి హైదరాబాద్‌కు రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేయబడుతుంది.

ముందుగా అక్కంపల్లి రిజర్వాయర్‌కు..

ఈ నీటిని ముందుగా అక్కంపల్లి రిజర్వాయర్‌కు తరలించి, కోదండాపూర్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా నగరానికి తరలించనున్నట్లు సమాచారం. అయితే నాగార్జునసాగర్‌లో నీటిమట్టం రోజురోజుకు పడిపోతుండడంతో నీరు ఉన్నచోటే పంపింగ్‌ చేసేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు.

Hyderabad Water Problem

500 మిలియన్ గ్యాలన్లు సరఫరా

ఈ క్రమంలో పుట్టంగండి వద్ద నీటిని తోడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా రోజుకు 500 మిలియన్ గ్యాలన్ల సరఫరా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మే 15 నాటికి అత్యవసర పంపింగ్ ప్రారంభం కావచ్చని కూడా పేర్కొంది.

ప్రస్తుతానికి, హైదరాబాద్ వాసులకు తగినంత నీరు అందుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు రిజర్వాయర్లలో నీరు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెలాఖరు నాటికి నగరంలో నీటి సమస్య ఉండకపోవచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు.

Hyderabad Water Problem

Comments are closed.