Swami Chakrapani Comments: రాజధానిగా చంద్రయాన్ 3 దిగిన ప్రాంతం, రాష్ట్రాన్ని కూడా ప్రకటించాలని డిమాండ్

Telugu Mirror : చంద్రుడిని ‘హిందూ రాష్ట్రం’గా ప్రకటించాలని మరియు చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్(SpaceCraft ) ల్యాండింగ్ సైట్‌ను హిందూ రాష్ట్రం యొక్క రాజధానిగా ప్రకటించమని — హిందూ ధర్మకర్త మరియు అనుచిత వ్యాఖ్యలతో అపఖ్యాతి పాలైన స్వామి చక్రపాణి మహారాజ్ యొక్క అసమంజసమైన డిమాండ్లు. అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు అయిన స్వామి చక్రపాణి ఓ వీడియోలో మాట్లాడుతూ, ఇతర మతాల వారి కంటే ముందు చంద్రుడిపై తన యాజమాన్యాన్ని భారత ప్రభుత్వం గట్టిగా ప్రకటించాలని పిలుపునిచ్చారు మరియు ఈ మేరకు పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.

ఇస్రో యొక్క చంద్రయాన్-3(Chandrayan-3) పోయిన వారం చంద్రుని దక్షిణ ధృవంపై చారిత్రాత్మక మృదువైన ల్యాండింగ్ తర్వాత, ల్యాండర్ తాకిన ప్రదేశాన్ని ‘శివశక్తి పాయింట్’ అనే పేరుతో పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసిన స్వామి చక్రపాణి మహారాజ్, “ఏ ఒక్క ఉగ్రవాది చంద్రుని ఉపరితలం చేరుకోకుండా భారత ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. పార్లమెంటులో చంద్రుడిని హిందూ సనాతన్ రాష్ట్రంగా ప్రకటించి, చంద్రయాన్ – 3 ల్యాండింగ్ అయిన శివశక్తి పాయింట్ ప్రదేశాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని, ఇలా చేయడం వలన జిహాదీ మనస్తత్వం ఉన్న ఏ ఉగ్రవాది చంద్రుని ఉపరితలం మీదకు వెళ్ళకూడదు అని వీడియోలో ఉద్ఘాటించారు.

Image Credit : V6 news

About Sleep : ‘నిద్ర’ గురించి పూర్తి వివరణ, నిద్రలేమి సమస్యకు నివారణ తెలుసుకోండి ఇలా.

స్వామి చక్రపాణికి ఈ రకమైన వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. 2020 లో, ప్రపంచం కరోనా వైరస్(Corona Virus) మహమ్మారితో పోరాటం చేస్తున్నప్పుడు, అతను దేశ రాజధాని ఢిల్లీలో “గోమూత్ర పార్టీ”ని నిర్వహించాడు, అక్కడ అతను మరియు అతని తోటి అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు కరోనా వైరస్ ని రాకుండా అడ్డుపడాలని ఆవు మూత్రం తాగారు. అలాగే పీటీఐ(PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ జంతువులను చంపి తినే వ్యక్తుల వలననే కరోనా వైరస్ వచ్చింది. మీరు ఒక జంతువును నిర్ధాక్షణ్యంగా చంపినప్పుడు, అది చంపబడిన ప్రదేశంలో విధ్వంసం కలిగించే ఒక విధమైన శక్తిని సృష్టిస్తుంది” అని ఆయన అన్నారు.

“ప్రపంచ దేశాల నాయకులు భారతదేశం నుండి ఆవు మూత్రాన్ని దిగుమతి చేసుకోవాలని. ఎందుకంటే భగవంతుడు భారతీయ ఆవులో మాత్రమే ఉంటాడు మరియు ఏ విదేశీ జాతిలోనూ కాదు.”2018లో కేరళలో సంభవించి విలయ తాండవం చేసిన వినాశకరమైన వరదల సమయంలో స్వామి చక్రపాణి(Chakrapani) మాట్లాడుతూ రాష్ట్రంలో గొడ్డు మాంసం తినే వారికి ఏ విధమైన సహాయం చేయకూడదని అన్నారు.ఈ సంవత్సరం ప్రారంభంలో స్వామి చక్రపాణి, హిందూ మతాన్ని అవమానించే బాలీవుడ్ సినిమాలు, వెబ్‌సిరీస్ మరియు మ్యూజిక్ వీడియోలు మొదలైనవాటిలో కంటెంట్‌ను పరిశీలించడానికి “ధర్మ సెన్సార్ బోర్డు” ని ఏర్పాటు చేశాడు.

Leave A Reply

Your email address will not be published.