Pensioners Good News: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్, వారికి అదనపు పెన్షన్

తెలంగాణలో ఇప్పుడు 60 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు అందజేస్తున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం 70 ఏళ్ళు నిండిన వారి కోసం అదనపు పెన్షన్ అందిస్తున్నట్లు నిర్ణయించినది.

Pensioners Good News: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక రకాల పథకాలను అందిస్తున్నాయి. యవ్వనుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ అనేక పథకాలు ఉన్నాయి. అదేవిధంగా, ప్రభుత్వాలు (Governments) రైతులకు మరియు మహిళలకు కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు అందించే పథకాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు పింఛన్లు అందిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రతి రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ విధానాల్లో మార్పులు ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేస్తుంది. అయితే, రేవంత్ రెడ్డి సర్కార్ పెన్షన్ పొందే వృద్దులకు అద్భుతమైన వార్తను అందించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలో ఇప్పుడు 60 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు (Pensions) అందజేస్తున్నారు. అలాగే దివ్యాంగులు, వికలాంగులకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.4000 ఇస్తున్నట్లు హామీల్లో పేర్కొంది. అయితే 60 ఏళ్లు దాటిన వృద్దులకు వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ ఒకే రకమైన పింఛను అందజేస్తున్నారు. అయితే, ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉంది.

Telangana Pensions

Also Read: Ration Card Update news : కొత్త రేషన్ కార్డుపై తాజా అప్డేట్, ప్రభుత్వం ఏం చెబుతుందంటే?

అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొత్త పింఛను పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు మరియు కుటుంబ పెన్షనర్లకు అదనపు ఆదాయాన్ని అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ (Finance Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ కొత్త ఆదేశాలను ప్రకటించింది. ఈ క్రమంలో పలు అంశాలపై చర్చ జరిగింది.

70 నుంచి 75 ఏళ్లు పైబడిన వారికి 15 శాతం పింఛను లభిస్తుంది. అదేవిధంగా, 75 నుండి 80 సంవత్సరాల వయస్సు గల వృద్దుల కోసం 20 శాతం పెన్షన్ ఏర్పాటు జరిగింది. అదేవిధంగా 80 నుంచి 85 ఏళ్ల లోపు వారికి 30%, 90 నుంచి 95 ఏళ్ల లోపు వారికి 50% పెన్షన్‌ (Pension) ను అందజేస్తారు. నివేదికల ప్రకారం, 95 నుండి 100 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు 60% , 100 ఏళ్లు దాటిన వృద్ధులకు 100% కుటుంబ పెన్షనర్లకు అందజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలను అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు రవాణా, గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల గ్యాస్ వంటి పథకాలు ఇప్పటికే అమలు అయ్యాయి.

Comments are closed.