RTC Good News For Students విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, నూతన విద్యా సంవత్సరానికి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

RTC Good News For Students

RTC Good News For Students తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. రోజు ఎంతో మంది బస్సుల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఇక ఉచిత బస్సు సౌకర్యం కల్పించగానే రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఈ బస్సులను వినియోగిన్చుకుంటున్నారు.

హైదరాబాద్ లో 22 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ లో 22 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. ఈ బస్సులను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రవాణా  శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

మరో రెండు లేదా మూడు నెలల్లో 550 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం..

మహాలక్ష్మి పథకంలో భాగంగా టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బస్సుల రాకపోకలు గణనీయంగా పెరిగిన విషయం కూడా తెలిసిందే. అదనపు రద్దీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ కొత్త ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు సిద్దమయి నసంగతి కూడా తెలిసిందే. మరో రెండు లేదా మూడు నెలల్లో 550 ఎలక్ట్రిక్ బస్సులను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆర్టీసీ విద్యార్థులను ఉద్దేశించి ఆర్టీసీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ బస్సులు విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం, సాయంత్రం కళాశాలలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

కళాశాల యాజమాన్యాలు సహకరించాలని ఆర్టీసీ భావిస్తుంది

కళాశాల యాజమాన్యాలు సహకరించాలని ఆర్టీసీ కోరుకుంటుంది. ఆర్టీసీ ప్రకారం, ఆయా ప్రాంతాల్లోని కళాశాలలు ఒకే సమయంలో ప్రారంభం కాకుండా, గంట నుండి రెండు గంటల తేడాతో  బస్సులను మార్చవచ్చు. ఈ మేరకు ప్రతి కళాశాలకు లేఖలు రూపొందించి సంబంధిత యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆర్టీసీ ఈ పనిని డివిజనల్ మేనేజర్లకు అప్పగించింది. ఇప్పటికే బస్సులో ప్రయాణించే విద్యార్థులకు అధికారులు పరీక్షలు నిర్వహించారు.

నూతన విద్య సంవత్సరానికి ఎలక్ట్రిక్ బస్సులు 

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సర్వే పూర్తి చేసి దానికి అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అనేక కళాశాలల్లో వేల సంఖ్యలో విద్యార్థులు చేరారు. సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో, ప్రజలు షేర్డ్ కార్లు మరియు మోటార్ సైకిళ్లలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. బస్సులో వేలాడుతూ ఫుట్‌బోర్డ్‌లో ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు కొత్త బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టారు.

RTC Good News For Students

 

 

 

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in