Tirumala Alert : తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవం ఏప్రిల్ 21 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు చైత్రశుద్ధ పౌర్ణమితో ముగుస్తాయి.
మొదటి రోజు ఇలా
ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా నాలుగు మాడవేదులీల గుండా ఊరేగించనున్నారు. అనంతరం వసంతోత్సవ మండపంలో సేవలందిస్తారు. వసంతోత్సవ అభిషేకం నివేదనలు ముగించుకుని తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
రెండో రోజు ఇలా
రెండో రోజైన ఏప్రిల్ 22న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవం నిర్వహిస్తారు.
మూడో రోజు ఇలా
చివరి రోజైన ఏప్రిల్ 23న శ్రీ మలయప్పస్వామి, శ్రీదేవి సమేత భూదేవి సమేత శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవాలు, శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తి, శ్రీ రుక్మిణి సమేతంగా వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని సాయంత్రం ఆలయానికి చేరుకుంటారు.
ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం స్వామి, అమ్మవార్ల భక్తులకు వైభవంగా నిర్వహిస్తారు.ఇది పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు మరియు చందనంతో నింపబడి ఉంటుంది. ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం జరుపుకుంటారు.
‘వసంతోత్సవం’గా పిలువబడే శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవం వసంతంలో జరుగుతుంది. ఈ క్రతువులో స్వామికి సువాసనగల పుష్పాలను సమర్పించడమే కాకుండా, ఈ వసంతోత్సవంలో అనేక పండ్లను కూడా ప్రధాన ప్రక్రియగా పేర్కొనడం జరిగింది.
వసంతోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, అలాగే ఏప్రిల్ 21 నుంచి 23 వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
Tirumala Alert