Govu Bandhu Scheme: గోవు బంధు పథకం అంటే ఏంటి? ఇది ఎవరికి వర్తిస్తుందో తెలుసా?

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు గోవు బంధు పథకాన్ని అమలు చేయలేదు. మరి ఇంతకీ ఈ పథకం ఎవరికీ లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.

Govu Bandhu Scheme: గోవు బంధు పథకం ఇప్పుడు తెలంగాణ (Telangana) లో కలకలం రేపుతోంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఇలాంటివి తెస్తానని కూడా ఎవరు ఊహించలేదు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. దాంతో, తెలంగాణలో పార్టీ మరింత అభివృద్ధి చెందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఇప్పుడు అమలులో ఉన్న దళిత బంధు, బీసీ బంధు తరహాలో గోవుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) రాష్ట్ర ప్రచార్‌ ప్రముఖ్‌ పగుడాకుల బాలస్వామి కోరారు. పశువులను సంరక్షించేందుకు గోవు కాపరులకు నెలవారీ జీతభత్యం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉంటారని ఆయన చెప్పారు.

గోవుల శాలల నిర్వహణకు ప్రభుత్వంతో కలిసి కృషి చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఎలుకలు, పిల్లులు, కుక్కల మరణాలను చూస్తూ.  ఆవులను చంపినా ఏమీ చేయడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రజాసంఘాలు, వ్యవసాయం పై దృష్టి సారించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఆవును కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

Also Read: Kisan Vikas Patra Scheme : మీ డబ్బుని పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే, అసలుకి రెట్టింపు వడ్డీ వచ్చే స్కీం ఇదే!

ఆరు నెలలు గడుస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పాలనలో అనేక కార్యక్రమాలు అమలు చేయడంలో విఫలమైంది. కనీసం భరోసా పథకాల అమలుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఖజానాలో డబ్బులు లేవని చెబుతున్నారు. రైతులకు రైతు భరోస పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. మహిళలకు ఇంతవరకు నెలకు రూ.2,500 అందలేదు. ఈ తరుణంలో మరో వినూత్న పథకానికి ఆదరణ లభిస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో  (Loksabha Elections) కాంగ్రెస్‌కు గట్టి ప్రతిఘటనను అందించిన బీజేపీ కేవలం 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అంటే బీజేపీ విస్తరణ కాంగ్రెస్‌కు ఆందోళన కలిగిస్తోంది. హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ రకరకాలుగా ప్రయత్నిస్తుంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తోంది. గోవు బంధు పథకం బహుశా ఇందులో భాగం కావొచ్చని..తెలుస్తుంది. అయితే ఈ విధానాన్ని అమలు చేయాలన్న ఉద్దేశం కాంగ్రెస్‌ పాలనలో లేదని పేర్కొంటున్నారు.

Comments are closed.