Telangana Cabinet Meeting On March 12th: మార్చి 12న తెలంగాణ కేబినెట్ సమావేశం, ఆ పథకాలకు ప్రణాళికలు సిద్ధం

మొదట్లో ఒక్కో నియోజకవర్గానికి 3,500 నివాసాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తించే నిబంధనలను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే సిబ్బందిని కోరారు.

Telangana Cabinet Meeting On March 12th: మార్చి 12న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశానికి మంత్రులు, ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక ముఖ్యమైన అంశాల గురించి చర్చలు జరపనున్నారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు.

మొదట్లో ఒక్కో నియోజకవర్గానికి 3,500 నివాసాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తించే నిబంధనలను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే సిబ్బందిని కోరారు. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం మనకి తెలిసిందే.

ఎన్నికల కోడ్‌కు ముందు చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చ..

భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు హడ్కోకు రూ.3000  వరకు రుణాలు ఇచ్చేందుకు  ప్రభుత్వం ఇప్పటికే హౌసింగ్ బోర్డుకు అనుమతిని ఇచ్చింది. కేబినెట్ సమావేశంలో ఈ అంశం గురించి ప్రస్తావించి ఆమోదించనున్నారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీల్లో మహాలక్ష్మి రూ. 2,500 మహిళలకు ఆర్థిక సహాయం అందించడం కోసం కేబినెట్ ఆమోదించింది. అదనంగా, ఈ చర్చలో కొన్ని అదనపు విధాన అంశాలు కూడా ఈ చర్చల్లోకి రానున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్ త్వరలో విడుదల కానున్నందున, ఈ కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం తెలిపి, వాటిని ఆన్-గోయింగ్ ప్లాన్లుగా ఉంచే అవకాశం ఉంది.

టాటా గ్రూప్‌తో ఒప్పందం..

సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు. టాటా గ్రూప్ రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాలను (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

అందుకు తగిన అవగాహన ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వ ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్న టాటా టెక్నాలజీస్ 9 దీర్ఘకాలిక, 23 స్వల్పకాలిక మరియు బ్రిడ్జ్ కోర్సులను నైపుణ్యం గ్యాప్ ని తగ్గించడంలో సహాయపడనుంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Telangana Cabinet Meeting On March 12th

 

 

 

Comments are closed.