Telangana Sarpanch Elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, సర్పంచ్ ఇంకా స్థానిక ఎన్నికలు త్వరలో

మే 13న పోలింగ్ ప్రారంభం కాగా, జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో మరో ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది.

Telangana Sarpanch Elections 2024 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొన్నటి వరకు కొనసాగింది. ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు ‘నువ్వా నేనా’ అంటూ ప్రచారాలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. మే 13న పోలింగ్ ప్రారంభం కాగా, జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో మరో ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది.

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వగానే..

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయి, కోడ్‌ ఎత్తివేసిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ల ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే రాష్ట్రంలో నాలుగేళ్ల పాటు ఎన్నికలు ఉండవని ఆయన చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పట్టుదలతో పనిచేసి పార్టీని గెలిపిస్తే తగిన గుర్తింపు లభిస్తుందని స్థానిక పదవులకు ఆసక్తి ఉన్న నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. జూన్‌ 4న పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, అదే వారంలోగా నోటిఫికేషన్‌ వెలువడనుంది.

2019 జనవరిలో మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి

గతంలో 2019 జనవరిలో మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి.ఫిబ్రవరి 1 నాటికి గ్రామాల్లో సర్పంచ్‌తో కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. వీరి పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 1తో ముగిసింది. దీంతో సంఘాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. MMRO/MPDO/వ్యవసాయ అధికారి/MDO/MPO, మరియు ఇతర గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరికి గ్రామ కార్యదర్శితో కలిసి జాయింట్ చెక్ పవర్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఎన్నికల వరకు వారి ఆధ్వర్యంలోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

సర్పంచ్ ఎన్నికలకు పదేళ్లపాటు రిజర్వేషన్లు చెల్లుబాటు

2019లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు పదేళ్లపాటు రిజర్వేషన్లు చెల్లుబాటు అయ్యేలా చట్టం చేసింది. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13 వేలకు పైగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. బ్యాలెట్‌ పద్ధతిలో కూడా ఈ ఏడాది పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యథావిధిగా పోలింగ్, మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు ఉప సర్పంచ్‌ ఎన్నిక జరగకుంటే మరుసటి రోజు మరో అవకాశం వస్తుందని భావిస్తున్నారు.

Telangana Sarpanch Elections 2024

 

 

Comments are closed.