ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ నేడే, లక్నో వెదర్ రిపోర్టుపై ఓ లుక్కేయండి

ICC మెన్స్ వరల్డ్ కప్ 2023లో ఈరోజు లక్నోలో ఉన్న రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరగనున్న 29వ మ్యాచ్ లో ఇండియా ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది.

Telugu Mirror:  ICC మెన్స్ వరల్డ్ కప్ 2023లో ఈరోజు లక్నోలో ఉన్న రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరగనున్న 29వ మ్యాచ్ లో ఇండియా ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. పాయింట్స్ పట్టికలో 5 ఆటలు ఆడి 5 విజయాలను సాధించి మొదటి నాలుగు స్థానాల్లో ఉంటే వారు సెమీ ఫైనల్స్ కి అర్హత పొందుతారు. ఇండియా 5 ఆటలతో 5 విజయాలను సాధించి ఈరోజు జరగబోయే మ్యాచ్ లో గెలవాలని లక్ష్యం గా పెట్టుకుంది. ఇంగ్లాండ్ వరుసగా ఐదు ఆటలు ఆడగా అందులో నాలుగు ఓటమిలను చవిచూసింది. సెమిఫైనల్ (Semifinal) మ్యాచ్ లో ఆడాలి అంటే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది.

ఇండియా vs ఇంగ్లాండ్ మధ్య జరగబోతున్న మ్యాచ్ కి వాతావరణ సూచన ఎలా ఉంది ?

అక్యూవెదర్ (Accuweather) ప్రకారం, లక్నోలో (Lucknow) కాస్త మసకబారిన వాతావరణం కనిపిస్తుంది. ఇక్క తేమ 30% గా ఉంది మరియు అవపాతం సంభావ్యత జీరో గా ఉంది. ఇక ఉష్ణోగ్రత 13 మరియు 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. మొదటి ఆరు ఇన్నింగ్స్‌లలో లక్నో వేదిక వద్ద జరిగిన ODI-ఫార్మాట్ మ్యాచ్‌లలో సగటు స్కోరు 226గా ఉంది. అయితే, ఏకనా స్టేడియంలోని పిచ్ ఈ సంవత్సరం ప్రారంభంలో తిరిగి వేయబడినందున ఊహించడం కష్టంగా మారింది.

Also Read : బ్యాడ్ అంపైరింగ్ బ్యాడ్ రూల్స్ తో పాకిస్థాన్ ఓటమి, నిబంధనను సవరించాలంటున్న హర్భజన్ సింగ్

ఏకనా క్రికెట్ స్టేడియంలో పన్నెండు వన్డే మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో మూడింటిని మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలవగా మరో తొమ్మిది బౌలింగ్ జట్లు గెలిచారు. వేదిక సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 229 గా ఉండగా మరియు సగటు రెండవ ఇన్నింగ్స్ స్కోరు 213గా ఉంది. ఐసిసి ప్రపంచ కప్ 2023లో ఇప్పటివరకు ఏకనా స్టేడియంలో మూడు మ్యాచ్‌లు జరిగాయి. స్టేడియంలో జరిగిన మొదటి ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో, ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా అత్యధికంగా 311 పరుగులను నమోదు చేసింది.

india-vs-england-match-today-take-a-look-at-lucknow-weather-report
Image Credit : Jagran Josh

ఏకనా స్టేడియంలో జరిగిన రెండో ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ వేదికపై శ్రీలంకతో జరిగిన మూడో ప్రపంచకప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత ఆటగాళ్లు పిచ్‌కు అలవాటుపడినప్పటికీ, 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే ఫార్మాట్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. ఏకనా స్టేడియం (Ekana Cricket Stadium) ఇంగ్లండ్‌కు తొలిసారిగా వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం పలకనుంది.

Also Read : ఉమెన్ డెలివరీ భాగస్వాములకు జొమాటో అందిస్తున్న మెటర్నిటీ ఇన్సూరెన్సు ప్లాన్

IND vs ENG లైన్ అప్స్ :

ఇంగ్లాండ్ :

జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (c & wk), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

ఇండియా :

విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ (C), షుబ్మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ , రవీంద్ర జడేజ, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్, జస్ప్రిట్ బుమ్రా, మొహమ్మద్ షమీ, అశ్విన్ , షార్దుల్ ఠాకూర్ .

Comments are closed.