Hyderabad Ooty Tour : హైదరాబాద్ టు ఊటీ టూర్.. తక్కువ ధరతో ప్రకృతి అందాలను చూసేయండి.

హైదరాబాద్ టు ఊటీ టూర్, రైలు టూర్ ప్యాకేజీలో మొత్తం 6 రోజులు మరియు 5 రాత్రులు గడపాల్సి ఉంటుంది. ఇది తమిళనాడులోని ఊటీని దాని అందమైన ప్రకృతి అందాలను, ఆహ్లాదకరమైన వాతావరణం చూడవచ్చు.

Hyderabad Ooty Tour : వేసవి సెలవులు సెలవులు వచ్చేశాయి. పిల్లలు, పెద్దలు సమ్మర్ వెకేషన్ (Summer vacation) కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే, మీరు కూడా మీ పిల్లలతో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? తక్కువ బడ్జెట్ లో మంచి ప్రదేశానికి వెళ్లనుకుంటే ఒక చక్కటి టూర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే IRCTC అల్టిమేట్ హైదరాబాద్ ఊటీ టూర్ (Ooty Tour). ఈ టూర్ ప్యాకేజి ఎంత? ఎన్ని రోజులు ఉంటుంది? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఊటీతో పాటు కూనూర్‌ను కూడా సందర్శించే అవకాశం ఉంది. ఈ రైలు టూర్ ప్యాకేజీలో మొత్తం 6 రోజులు మరియు 5 రాత్రులు గడపాల్సి ఉంటుంది. ఇది తమిళనాడులోని ఊటీని దాని అందమైన ప్రకృతి అందాలను, ఆహ్లాదకరమైన వాతావరణం చూడవచ్చు.

ప్యాకేజీ ధరలు ఎంత?

కంఫర్ట్ క్లాస్ (3A) సింగిల్ షేరింగ్ కోసం ప్యాకేజీ ధర రూ. 33020 ఉండగా, డబుల్ షేరింగ్ కు రూ. 18480, మరియు ట్రిపుల్ షేరింగ్ రూ. 14,870గా నిర్ణయించారు. సాధారణ ట్రిపుల్ షేరింగ్ రూ.12,410గా ఉంది. డబుల్ షేరింగ్ కి మొత్తం రూ. 16,020గా నిర్ణయించారు. ప్యాకేజీలో రైలు టిక్కెట్లు, హోటల్ బుకింగ్, భోజనం, అల్పాహారం మరియు రాత్రి భోజనం ఉంటాయి.

Hyderabad Ooty Tour

ప్రయాణ బీమా.

ఈ ప్యాకేజీలో ప్రయాణికులందరికీ ప్రయాణ బీమా ఉంటుంది. ఇది కాకుండా, ట్రిప్ సమయంలో టూర్ మేనేజర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ పర్యటనను హైదరాబాద్ నుండి వెళ్తున్నారు కాబట్టి ఈ టూర్ అంత ఖరీదైనది కాదు అనే చెప్పవచ్చు. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ టూర్ రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది.

ఆరు రోజుల పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

ముందుగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ రోజు శబరి ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 17230) బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి ఊటీకి దాదాపు 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హోటల్‌లో బస చేసిన తర్వాత, సాయంత్రం బొటానికల్ గార్డెన్స్ (Botanical Gardens) మరియు ఊటీ సరస్సును సందర్శించండి.

మూడవ రోజు ఉదయం, హోటల్‌లో టిఫిన్ చేసి, దొడబెట్ట శిఖరం, టీ మ్యూజియం మరియు పైకర జలపాతాలను సందర్శించడంతో డే 3 టూర్ ముగుస్తుంది. నాల్గవ రోజు, కూనూర్ పర్యటన మొదలవుతుంది. అదే హోటల్‌లో రాత్రిపూట గడపాల్సి ఉంటుంది. ఐదవ రోజు, ఊటీ నుండి కోయంబత్తూరుకు బయలుదేరే ముందు అదే హోటల్‌లో టిఫిన్ చేస్తారు. సాయంత్రం 4:35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 17229) ఎక్కి ఆరవ రోజు, మధ్యాహ్నం 12:20 గంటలకు, ఊటీ ప్రయాణం సికింద్రాబాద్ స్టేషన్‌. చేరుకుంటారు. దీంతో టూర్ పూర్తవుతుంది.

Hyderabad Ooty Tour

Comments are closed.