India vs New Zealand : రికార్డ్ బద్దలు కొట్టిన డిస్నీ+ హాట్స్టార్, 5.3 కోట్లు దాటిన వీక్షకుల సంఖ్య
ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ డిస్నీ+ హాట్స్టార్ లో 5.3 కోట్ల వ్యూస్ కి చేరుకుంది. లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లోనే రికార్డ్ వ్యూయర్షిప్ దక్కించుకుంది. క్రికెట్ చరిత్రలో అత్యధికంగా వ్యూస్ అందుకున్న మ్యాచ్గా ఇది కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది.
Telugu Mirror : ICC క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్ లో ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య హోరా హోరీగా జరిగిన మ్యాచ్ సమయంలో వ్యూయర్ల (Viewers) సంఖ్య 5.3 కోట్ల మార్కును తాకడంతో డిస్నీ+ హాట్స్టార్ కొత్త రికార్డును నెలకొల్పింది. ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్ఫారమ్ అయిన డిస్నీ+హాట్స్టార్లో (Disney+ Hotstar) ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షకుల సంఖ్యా దాదాపు 5.3 కోట్ల గరిష్ట మార్క్ కు చేరుకుంది. దీనితో, ఈ ఏడాది ప్రపంచ కప్ ప్రారంభంలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లీగ్ మ్యాచ్లో 3.9 కోట్ల గరిష్ట మార్క్ ని అధిగమించింది.
ఆసియా కప్లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్లో 2.8 కోట్ల గరిష్ట స్థాయి నమోదు కాగా, ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2019లో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్లో గరిష్ట మార్క్ 2.53 కోట్లుగా నమోదైంది.బుధవారం జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో మరియు డిస్నీ+ హాట్స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయితే టెలివిజన్ ప్రేక్షకులను కొలిచే సంస్థ, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) ద్వారా ఆ మ్యాచ్ యొక్క వీక్షకుల డేటా ఒక వారం వరకు పబ్లిక్ చేయబడదు. వారం తర్వాత ఆ డేటాను BARC విడుదల చేస్తుంది.
View this post on Instagram
డిస్నీ+హాట్స్టార్ క్రికెట్ (Cricket) పోటీలు కొనసాగుతున్నంత కాలం ప్రతి కస్టమర్కు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించడానికి దాని నిబద్ధతకు అనుగుణంగా కొనసాగుతుందని చెప్పారు. ఐసిసి మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇలాంటి మరెన్నో అనుభవాలను పొందాలనుకుంటున్నాం అని శివానందన్ పేర్కొన్నాడు.
Also Read : గూగుల్ బ్లాక్ ఫ్రైడే డీల్స్లో పిక్సెల్ 8 సిరీస్, పిక్సెల్ ఫోల్డ్ మరియు మరిన్నింటిపై భారీ తగ్గింపులు
విరాట్ కోహ్లీ మరియు శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగిపోయారు, మ్యాచ్లో 50 వన్డే సెంచరీలు చేసి విరాట్ కోహ్లీ క్రికెట్ చరిత్రలో మొదటి బ్యాటర్గా నిలిచాడు. 49 వన్డే సెంచరీలతో ఇప్పటివరకు ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ప్రపంచకప్లో ఒకే ఎడిషన్లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు.
Comments are closed.