Guppedantha manasu serial feb 2nd episode : భద్ర నిజస్వరూపం బయటపెట్టిన వసుధార.. శైలేంద్ర గుండెల్లో దఢ
ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
- కొడుకు కోసం మహీంద్ర ఆవేదన
- భద్ర నిజస్వరూపం బయట పెట్టిన వసుధార
- నిజం చెప్పి శైలేంద్రకు షాక్ ఇచ్చిన వసుధార
కొడుకు కోసం మహీంద్ర ఆవేదన..
వసుధార, మహీంద్ర, వసు నాన్న, అనుపమ అందరూ కూర్చొని రిషి ఏం అయ్యాడో అని మాట్లాడుకుంటున్నారు. ఇక తన కొడుకు కోసం 3 ఏళ్ల నుండి బాధ పడుతూనే ఉన్నానంటూ ఆరోదన వ్యక్తం చేశారు. శైలేంద్ర ఎండీ కోసం చేసే నీచమైన పనుల వల్ల అందరూ సతమతమైపోతున్నారు అని మహీంద్ర ఆరోపిస్తున్నాడు. శైలేంద్ర నిజ స్వరూపం బయట పెడదాం అనే లోగానే జగతి దూరం అయింది.
ఆ నింద రిషి మీద వేసి నా కొడుకు ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్లిపోయేలా చేశారు. ఇప్పుడు రిషిని మళ్ళీ ఎవరో కిడ్నాప్ చేశారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు అని మహీంద్ర తన బాధని చెప్పుకుంటాడు. ఇంతలో వసు వాళ్ళ నాన్న, నన్ను క్షమించండి బావగారు, అల్లుడి గారిని కాపాడలేకపోయాను అని చెబుతాడు. అదేం లేదు బావ గారు, అందులో మీ తప్పు ఏమిలేదు అని మహీంద్ర అంటాడు.
భద్ర నిజస్వరూపం బయట పెట్టిన వసుధార
వసుధార భద్ర నిజ స్వరూపం తెలుసుకోడానికి నాటకం ఆడుతుంది. రిషి దొరికాడా అంటూ భద్రకు వినిపించేలాగా మాట్లాడి అక్కడ నుండి కార్ లో వెళ్తుంది. అది విన్న భద్ర శైలేంద్రకి ఫోన్ చేసి ఒక గంట తర్వాత నేను చెప్పిన ప్రదేశానికి రండి.. రిషిని, వసుధారని చంపేస్తాను అని చెప్పి వసుధారాణి ఫాలో అవుతాడు భద్ర. వెంటనే వసుధారా భద్రను చంప దెబ్బ కొడుతుంది. నువ్వు చేసే పనులు అన్ని నాకు తెలుసు. నువ్వు పెద్ద ఫ్రాడ్ అని నాకెప్పుడో తెలుసు అని వసుధార చెబుతుంది. ముకుల్ కి అప్పగించి పోలీస్ కస్టడీ లో భద్రని దాస్తుంది.
నిజం చెప్పి శైలేంద్రకు షాక్ ఇచ్చిన వసుధార
ఇంతలో శైలేంద్ర భద్ర కోసం వెతుక్కుంటూ వస్తాడు. శైలేంద్రకు వసుధార ఎదురయి ఏంటి శైలేంద్ర ఎవరి కోసం వెతున్నావ్? నా కోసమా లేక భద్ర కోసమా అని అడుగుతుంది? వెంటనే శైలేంద్ర షాక్ అయి, నేను ఎక్సరసైజ్ చేయడానికి వచ్చాను అని చెబుతాడు. నీ అబద్దాలు, నాటకాలు ఇంకా ఎన్ని రోజులు అని వసు అంటుంది.
భద్ర నీ మనిషిని అని నాకు తెలుసు. ప్రస్తుతం భద్రని ముకుల్ కి అప్పగించా, నిజాలు ఏంటో అన్ని త్వరలో బయపడతాయి అని వసుధారా శైలేంద్రకి చెబుతుంది. ఇక శైలేంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు.
Comments are closed.