51,000 మందికి ఉద్యోగాలు, ప్రధాన మంత్రి మోదీ ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ను అందుకున్న యువత

రాబోయే రోజుల్లో మరెన్నో ఉద్యోగావకాశాలు ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్ , ఫార్మ వంటి అనేక రంగాల్లో కల్పిస్తున్నట్లు మరియు ఆర్ధిక పరంగా ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అని మోదీ పేర్కొన్నారు.

Telugu Mirror : ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51 వేల మంది యువకులు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి నియామక లేఖలు అందుకున్నారు. ఈ మధ్యకాలంలో నవ భారతం బాగా అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. నియమితులయిన 51 వేల మంది ఉద్యోగులకు అపాయింట్మెంట్ (Appointment)  లెటర్ ను అందుకున్నారు. అదే సమయంలో, నేటి జాబ్ మేళా నుండి రిక్రూట్‌మెంట్ లెటర్‌లు అందుకున్న ప్రతి దరఖాస్తుదారుని ప్రధాని మోదీ అభినందించారు. ఎక్కడికి వెళ్లినా మహిళలు తమ జెండాను ఎగురవేస్తున్నారు. జాతీయ ప్రభుత్వం యువత ప్రతిభను మరియు ఉత్సాహాన్ని దేశ నిర్మాణం కోసం ఉపయోగించుకోవడంపై అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది.

ఈ విజయం సాధించడానికి మీరందరూ చాలా కష్టపడ్డారు. ఈ సాఫల్యం మీ జీవితానికి కీలకం అని ఆయన చెప్పుకొచ్చారు. అక్టోబర్ 22న రోజ్ గార్ మేళ (Rozgar Mela) ప్రారంభమయింది. అప్పటి నుండి కొన్ని వేల అపాయింట్‌మెంట్ లెటర్‌లను ప్రధాన మంత్రి అందజేశారు. ఇది రోజ్ గార్ మేళకి సంబంధించి ఎనిమిదవ ఎడిషన్ అయితే ఇది దేశ వ్యాప్తంగా 45 వేర్వేరు ప్రాంతాలలో జరిగింది.

మోడీ నా మజాకా, అరవైలో ఇరవైలా ఉన్న ప్రధాని మోడీ. ప్రధాని ఫిట్ నెస్ రహస్యం తెలుసా?

ఈరోజు జాతీయ పర్వదినమైన గణేష్ ఉత్సవ్ అని ప్రధాని యువతకు తెలియజేశారు. ఈ శుభ సమయంలో, మీలో ప్రతి ఒక్కరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో ఉద్యోగావకాశాలు ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్ , ఫార్మ వంటి అనేక రంగాల్లో కల్పిస్తున్నట్లు మరియు ఆర్ధిక పరంగా ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అని ఆయన అన్నారు. పరిపాలన విధానం లో యువత యొక్క పాత్ర గురించి చెప్పుకొచ్చారు. ఈ జనరేషన్ లో ఉన్న సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చేయడంలో యువత పాత్ర ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

 

2047 సంవత్సరం నాటికి మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా, ప్రజలకు సేవలను అందించే విధంగా ఉండాలి అని నియమితులయిన వారికి ప్రధాని మోడీ చెప్పారు. రైల్వే స్టేషన్ బుకింగ్  కార్యాలయాల వద్ద ప్రజలు క్యూలో వేచి ఉండాల్సిన సమస్యను సాంకేతికత పరిష్కరించిందని ప్రధాని చెప్పారు. డిజిటల్ లాకర్, e KYC మరియు ఆధార్ కార్డ్ సంక్లిష్టమైన డాక్యుమెంటేషన్ అవసరాన్ని తొలగించాయి. కర్మయోగి ప్లాట్‌ఫారమ్‌లో IGOT ద్వారా 600 కంటే ఎక్కువ కోర్సులు హైలైట్ చేస్తూ చెప్పారు.

Comments are closed.