MGNREGA : ప్రజలకు అదిరిపోయే న్యూస్.. 100 రోజుల పనికి ఇప్పుడు రూ. 300.
ఏపీలో ఉపాధి హామీ కూలీల రోజువారీ పరిహారాన్ని పెంచుతున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు.
MGNREGA : ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఏపీలో ఉపాధి హామీ కూలీల రోజువారీ పరిహారాన్ని పెంచుతున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు.
MGNREGA మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రవేశ పెట్టారు. పేదలకు ప్రతి సంవత్సరం 100 రోజులు పని కల్పించి సామాజిక మరియు ఆహార భద్రతను పెంపొందించే తగిన లక్ష్యాలతో ఈ ప్రణాళికను ప్రారంభించారు.
Also Read : Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. వాళ్లకి కూడా డబ్బులు జమ.
100 రోజుల పనికి ఇప్పుడు రూ. 300
2005 ఆగష్టు 25న కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అమలు చేసింది. ప్రతి ఆర్థిక సంవత్సరం పని లేక ఇబ్బంది పడ్తున్న వారందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో 100 పనిదినాల కనీస వేతనం అందించాలనే లక్ష్యంతో ప్రవేశ పెట్టారు. ఈ పథకం ప్రారంభమైనప్పుడు, కూలీలకు రోజువారీ చెల్లింపు రూ.87.50; ఇప్పుడు వారికి రూ.272 చెల్లిస్తున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఏపీలోని కూలీలందరికీ అదనంగా రూ.28 కలిపి రూ.300 అందజేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఆర్థిక సంవత్సరానికి ఈ ఏప్రిల్లో ప్రారంభమయ్యే కనీస వేతనాన్ని రూ.300గా నిర్ణయించింది. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారికి ఇది సంతోషకరమైన విషయం అనే చెప్పుకోవాలి.
మూడు నెలలపాటు..
గ్రామాల్లోని వ్యవసాయ కూలీలు (Agricultural laborers) వేసవి అంతా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మూడు నెలల పాటు పని చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ ఏర్పాటులో కూలీలకు ఉదయం, సాయంత్రం వేళల్లో పని చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రణాళికను స్థాపించినప్పటి నుండి గ్రామీణ ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలలు కనిపించాయి. వ్యవసాయ కూలీలు ఉపాధి పొందడమే కాకుండా ఇతర ప్రాంతాలకు వలసలు తగ్గుతున్న విషయం కూడా తెలుస్తుంది.
Also Read : Telangana Districts : తెలంగాణాలో జిల్లాలు కుదింపు..రద్దయే జిల్లాలు ఇవే..!
మరోవైపు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు చెల్లించే ఆదాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డుతో (Aadhaar card) లింక్ చేసిన కూలీల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Comments are closed.