Guppedantha Manasu serial today episode : దేవయాని ప్లాన్ రివర్స్- శైలేంద్రను తిట్టిన ఫణింద్ర..టెన్షన్ లో వసుధార

గుప్పెడంత మనస్సు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడే చదవండి.

Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. కార్తీక దీపం సీరియల్ తర్వాత అదే సమయానికి టెలికాస్ట్ అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ తో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది. దాని తర్వాత గుప్పెడంత మనస్సు సీరియల్ కి మంచి రేటింగ్ కూడా ఉండేది కానీ సీరియల్ టైమింగ్స్ మారాయి కాబట్టి రేటింగ్ లో కాస్త తగ్గింది.

అయినప్పటికీ గుప్పెడంత మనస్సు సీరియల ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. శైలేంద్ర  నేటి ఎపిసోడ్ లో కాలేజీ బాధ్యతలు వసుధారాకి కాకుండా శైలేంద్రకి ఇవ్వమని దేవయాని తన భర్తకి అడుగుతుంది. కానీ శైలేంద్రని తిడుతూ ఏ పని చేయడం చేతకాదని చెప్పి వసుధారాకి సహాయం చేయమని చెబుతాడు.

ఇక వసుధారా ఈవెంట్ కి సంబంధించిన పనులు పూర్తి చేయడంలో బిజీ గా ఉంది. మరో వైపు శైలేంద్ర ఈవెంట్ ని ఎలా ఫెయిల్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంతలో ధరణి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు అండి! రేపు జరిగే ఈవెంట్ ఎలా ఫెయిల్ చేయాలనీ ఆలోచిస్తున్నారా? అని ధరణి అంటుంది. కానీ శైలేంద్ర అలాంటిదేమి లేదు వసుధారాకి మంచి చేయాలనీ చూస్తున్న అని చెబుతాడు.

guppedantha-manasu-serial-today-episode-devyanis-plan-reverses-phanindra-scolds-shailendra-vasudhara-in-tension

Also Read : Guppedantha manasu serial today Episode : కాలేజీలో జరిగే ఫెస్ట్ సక్సెస్ కానివ్వనంటున్న శైలేంద్ర..రిషి లేకుండా వసు ఒంటరిగా.. ఏం జరగనుంది?

ధరణి ఇచ్చే ఐడియాతో ఏదైనా జరుగుతుందా అని ధరణిని అడుగుతాడు. అయితే, ధరణి రేపు ఈవెంట్ కి రిషి వస్తున్నాడు అని చెప్పమని చెప్పింది. ధరణి వసు మంచి కోరి చెప్పింది శైలేంద్రకి ఇది ఎలా రివర్స్ అవుతుందో చూడాలి.

జగతీయే గురువు, దైవం అంటున్న వసుధారా ..  

కాలేజీలో జరిగే ఈవెంట్ ఎటువంటి అడ్డంకులు లేకుండా జరగాలని జగతి ఫోటో ముందు వసుధారా కోరుకుంటుంది. జగతి మేడం, రిషి సర్ పక్కన ఉంటే ఎంతో ఉత్సాహంగా పని చేసేది వసుధారా. ఈసారి వారిద్దరూ లేకుండా ఒంటరిగా ఈవెంట్ పనులు చేస్తుంది కాబట్టి కాస్త టెన్షన్ గా ఉందని చెప్పింది. మహేంద్ర వసుధారాణి మీ అత్తయ్య దగ్గర ఏమని కోరుకున్నావ్ అని అడిగాడు. ఎప్పుడూ నేను వంటరిగా కాలేజీకి సంబంధించిన  పనులు చేయలేదు కదా మామయ్య అన్నీ సరిగ్గా జరగాలని కోరుకున్న అని చెబుతుంది.

ఆ మాటలు విన్న మహేంద్ర దేవుడి దగ్గర కదమ్మా ఇలాంటివి కోరుకునేది అని అంటాడు. అప్పుడు వసుధారా నాకు గురువు అయిన దైవం అయిన జగతీ మేడమే అని చెబుతుంది.

Comments are closed.