ఆసియాలో అతిపెద్ద కురగాయాల మార్కెట్ ఎక్కడ వుందో మీకు తెలుసా

ఈ మార్కెట్ సుమారు 90 ఎకరాల భూమిని విస్తరించి ఉంది. మరియు ఇది భారతదేశ జాతీయ రాజధాని అయినా ఢిల్లీ లో ఉంది. మీరు ఆజాద్‌పూర్ సంతకి రాగానే ముందుగా గమనించేది పెద్ద గేటు. దానిపై "చౌదరి హీరా సింగ్ హోల్‌సేల్ వెజిటబుల్ మార్కెట్ ఆజాద్‌పూర్" అని రాసి ఉంటుంది.

Telugu Mirror : ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ వివిధ రకాల కూరగాయలతో కూడిన వంటకాలు తింటూ ఉంటారు. వివిధ రకాల కూరలతో భోజనం చేస్తే సంతృప్తికరంగా ఉంటుంది మరియు ఇష్టంగా తింటారు. సంతృప్తికరంగా భోజనం చేయడానికి రెండు ప్రాథమిక కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, వివిధ కూరలో చూడడానికి అందంగా మరియు ఆకర్షణీయయంగా ఉంటుంది. మరియు రెండవ కారణం, మన శరీరానికి ఎంతోగానో అవసరమయ్యే ఐరన్ మరియు శరీరానికి ముఖ్యమైన విటమిన్లను అందిస్తుంది. అయితే ఆసియాలోని పెద్ద కూరగాయల మార్కెట్ ఎక్కడ ఉందో తెలుసా? ఆ మార్కెట్ భారత దేశం లోనే ఉంది. అవును మీరు విన్నది నిజం. భారతదేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఉన్న ఆజాద్‌పూర్ ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్‌కు నిలయం. అయితే ఆ మార్కెట్ గురించిన ప్రత్యేకతలను, అలాగే ఎక్కువ భారతీయ రైతులందరూ అక్కడ వ్యాపారాన్ని నిర్వహించడానికి ఆసక్తి చూపడానికి గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : రాజకీయాల్లోకి సమంత ఎంట్రీ ఇవ్వనుందా ,ఆ పార్టీ తరపున ప్రచారం చేయనుందా?

ఈ మార్కెట్ మొత్తం 90 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

ఈ మార్కెట్ సుమారు 90 ఎకరాల భూమిని విస్తరించి ఉంది. మరియు ఇది భారతదేశ జాతీయ రాజధాని అయినా ఢిల్లీ లో ఉంది. మీరు ఆజాద్‌పూర్ సంతకి రాగానే ముందుగా గమనించేది పెద్ద గేటు. దానిపై “చౌదరి హీరా సింగ్ హోల్‌సేల్ వెజిటబుల్ మార్కెట్ ఆజాద్‌పూర్” అని రాసి ఉంటుంది. ప్రతిరోజూ అక్కడ మొత్తం దాదాపు కోటి రూపాయల లావాదేవీలు పూర్తవుతాయి. ఆ మార్కెట్ లో దొరకని కూరగాయలు దాదాపు ఆ చుట్ట ప్రక్కల దేశాల్లో మరియు భారతదేశలోనే వేరే ప్రదేశాల్లో అందుబాటులో ఉండవు. ఆ మార్కెట్‌లో, వివిధ వయసుల వారు పనిచేస్తున్నారు. అక్కడ, వివిధ పరిమాణాల వ్యాపారులు తమ వాణిజ్య లావాదేవీలను నిర్వహిస్తారు. ఒప్పందంలో లాభ నష్టాలూ ఉండడం సహజం. కొందరు లాభాన్ని పొందుతూ ఉంటారు మరి కొందరు నష్టాన్ని పొందుతూ ఉంటారు. అక్కడ మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇంటి నిర్వహణ బాధ్యతలతో పాటు వారు ఆ బరువుబాధ్యతను కూడా మోస్తున్నారు. కాబట్టి వారిని గౌరవిస్తూ ఉండండి.

do-you-know-where-is-the-biggest-vegetable-market-in-asia
image credit : EastMojo

Also Read : భారతదేశంలో బ్యాంక్ మేనేజర్ జీతం ఎంత,బ్యాంక్ మేనేజర్ కావడానికి అవసరమైన నైపుణ్యాలు తెలుసుకుందాము..

1977లో స్థాపించబడింది.

1977లో, మార్కెట్ కమిటీలచే నిర్వహించబడుతున్న అనేక కార్యకలాపాలు మరియు సంక్షేమ పథకాలను నిర్వహించడం, నియంత్రించడం మరియు నిర్దేశించడం వంటి ఉద్దేశ్యంతో ఆజాద్‌పూర్ మార్కెట్ లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (APMC) MNIని ఏర్పాటు చేశారు. మార్కెట్ కౌన్సిల్ సమర్ధవంతంగా పనిచేయడానికి మరియు రైతులు వారి ఉత్పత్తులకు సరసమైన ధరలను అందించడానికి, అసెంబ్లీ ద్వారా అనేక చట్టాలు ఆమోదించబడ్డాయి. నేడు, అన్ని రకాల పండ్లు మరియు కూరగాయలను అక్కడ కొనుగోలు చేయవచ్చు.

Leave A Reply

Your email address will not be published.