Successful PM Kisan Yojana : పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు వచ్చేది ఆ రోజే.. మరి ఇంతకీ ఈ-కేవైసీ పూర్తి చేశారా?

కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి రూ.6 వేల రూపాయలను జమ చేయడం ప్రారంభించింది. 17వ విడత డబ్బులు ఎప్పుడంటే..

Successful PM Kisan Yojana : ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది దేశంలోని రైతులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అని మన అందరికీ తెలుసు. ఈ పథకం అర్హులైన రైతులందరికీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ ప్రణాళిక ఫిబ్రవరి 2019లో ప్రవేశపెట్టారు ఇక అప్పటి నుండి రైతులు (Farmers) ప్రతి సంవత్సరం రూ. 6,000 రూపాయల సహాయం పొందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం (Central Government) మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి రూ.6 వేల రూపాయలను జమ చేయడం ప్రారంభించింది. ఏప్రిల్ నుండి జూలై వరకు, ఆగస్టు నుండి నవంబర్ వరకు మరియు డిసెంబర్ నుండి మార్చి వరకు విడతల వారీగా ఎకరాకు రూ. 2,000 చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

16వ విడతకు మొత్తం రూ.21,000 కోట్లు 

ఫిబ్రవరి 28న మహారాష్ట్ర యవత్మాల్ వేదికగా ప్రధాని మోదీ 16వ విడతను చివరిసారిగా పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా 9 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. విడుదల చేసిన మొత్తం రూ.21,000 కోట్లకు పైగా ఉంది. పీఎం కిసాన్ నిధులను టైమ్‌టేబుల్ ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు.

మరి 17వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు?

రైతుల దృష్టి ఇప్పుడు 17వ విడత నిధులపై పడింది. ఈ విడత ఎప్పటి నుంచి వస్తుందనే చర్చ మొదలైంది. ఇప్పుడు 17వ  విడత నిధులు మే చివరి వారంలో విడుదల చేయాలని కేంద్రం భావిస్తుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్ రానప్పటికీ, మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఖాతాలోకి నిధులు పంపిణీ చేస్తారు.

Successful PM Kisan Yojana

e-KYC పూర్తి చేస్తేనే డబ్బులు అందుతాయి..

అయితే e-KYC పూర్తి చేసిన రైతులకు మాత్రమే 17వ విడత అందుతుంది. కేంద్రం ఇప్పుడూ e-KYCని తప్పనిసరి చేసింది. KYCని పూర్తి చేయడానికి చాలా ఆప్షన్లు ఉన్నాయి.

  • మీరు దగ్గర ఉన్న సేవా కేంద్రానికి వెళ్ళవచ్చు. ఆధార్ కార్డును సబ్మిట్ చేసిన కూడా పని పూర్తవుతుంది.
  • http://pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి కూడా KYC పూర్తి చేయవచ్చు.
  • PM కిసాన్ GOI యాప్‌తో ఫేస్ అథారిటికేషన్ ను ఉపయోగించి కూడా KYC పూర్తి చేయవచ్చు.

ఎలా నమోదు చేసుకోవాలి..?

  • ముందుగా, ప్రధాన మంత్రి కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత రూరల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేదా అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంచుకోండి.
  • మీ ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. రాష్ట్రం పేరును ఎంచుకోండి. గెట్ OTPపై క్లిక్ చేయండి.
  • ఆపై మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
  • మీ రాష్ట్రం, జిల్లా, బ్యాంక్ సమాచారం మరియు ఏదైనా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయండి.
  • ఆ తర్వాత ఆధార్ కార్డు వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలి.

Successful PM Kisan Yojana

Comments are closed.