Excellent Nethanna Bharosa Scheme : 2024 లో మరో కొత్త పథకాన్ని ప్రవేశ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వారికి ఆసరాగా ఇంకా అండగా కూడా..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఆ పథకం ఏంటో అని అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం రండి.
Excellent Nethanna Bharosa Scheme : తెలంగాణలో(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం హామీల అమలు ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీల కింద ప్రకటించిన పథకాలను ఇప్పటికే కొన్ని అమలు చేసింది.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు..
మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు ఆర్టీసీ (RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ధరలు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, చేయూత పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి రూ.10 లక్షలు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల హామీ కింద రూ.5 లక్షల అందించడం వంటివి హామీలను ఇప్పటికే అముల్లోకి తీసుకొచ్చింది.
అయితే, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో మరికొన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది. మహిళలకు నెలకు రూ.2500, రైతులకు ఎకరాకు రూ.15000, కూలీలకు రూ.12000, వరి పంటలకు రూ.500 బోనస్, యువ వికాస్ పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షల బీమా కార్డు, వృద్దులకు రూ. 4000 పెన్షన్ అందించాలి.
కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఆ పథకం ఏంటో అని అనుకుంటున్నారా? రైతుల తర్వాత ఎక్కువగా చేనేత కార్మికులు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. గత ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు నేతన్న భరోసా పథకం కూడా ప్రవేశ పెట్టాలని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
చాలా మంది చేనేత కార్మికులు తగిన ఉద్యోగాలు లేక, తాము ఉత్పత్తి చేసే దుస్తులపై ఎక్కువగా ఆదరణ లేకపోవడం ఇంకా అప్పుల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ పంపించారు. చేనేత కార్మికులకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలని, వారికి తగిన పనిని ఇప్పించాలని ఆయన కోరారు.
నేతన్న భరోసా
అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో రాష్ట్రంలోని నేత కార్మికులకు కొత్త నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ స్ట్రాటజీని ప్రవేశపెట్టి ఏడాదిలోగా ఫలితాలను నేతలకు ప్రదర్శించాలని సీఎం భావిస్తున్నారు. చేనేత మరియు పవర్లూమ్ కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త పథకాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.
చేనేత కార్మికులకు అండగా
రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని నిర్మించాలని, చేనేత పార్కును పునరుద్ధరించాలని, కొత్త పవర్లూమ్ క్లస్టర్లను రూపొందించాలని, కొత్త సాంకేతిక టెక్స్టైల్ విధానాన్ని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలోని చేనేత కార్మికులందరికీ పని కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇప్పటికే రూ.53 కోట్ల విలువైన దుస్తులను కొనుగోలు చేసిందని ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. అన్ని ప్రభుత్వ సంస్థలు టెస్కో నుంచి దుస్తులు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు.
నేతన్న భరోసా ద్వారా రాష్ట్రంలోని అన్ని చేనేత సంస్థలకు నగదు అందించడంతో పాటు, వారు ఉత్పత్తి చేసే దుస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. మరి నేతన్న పథకం ఎప్పుడు అమలు అవుతుందో..వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అండగా నిలబడుతుందో చూడాలి.
Comments are closed.