Delhi Metro : అందరి చూపూ ఢిల్లీ మెట్రో వైపు..యువకుడిని చెంపదెబ్బ కొట్టిన మహిళ..

వైరల్ గా మారిన వీడియో

Telugu Mirror : ఢిల్లీ మెట్రో విచిత్ర సంఘటనల సమ్మేళనం మెట్రో లో జరిగే ఒక్కో సంఘటనా ఒక సెన్సేషన్ ఒక సంఘటన మరువక ముందే మరొక చిత్రం చోటు చేసుకుంటుంది తాజాగా డిల్లీ మెట్రోలో ఒక మహిళ తన సహ ప్రయాణికుడిని చెంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్ గా మారింది.
ఢిల్లీ మెట్రో రైల్ మరొక సారి అందరి ధృష్టిని తనవైపు తిప్పుకుంది. మెట్రోకి సంభంధించిన మంచి కారణంతో కాదు. ఢిల్లీ మెట్రో రైలు లో తీసిన వీడియోలో ఒక మహిళ తన ప్రక్కన నిలబడి ఉన్న తన తోటి ప్రయాణికుడిపై బిగ్గరగా అరుస్తూ ఉన్నది.

Arogya : మెదడు పనితీరును తగ్గిస్తున్న 3 పనులు..

అలాగే ఆమె మెట్రో బోగీలో ఉన్న అందరి ముందు అతనిని చెంప దెబ్బ కొట్టింది. మెట్రోలో క్యాప్చర్ చేసిన వీడియోను ఘర్ కే కాలేష్ అనే(@gharkekalesh) ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియోకి 67K వ్యూస్ వచ్చాయి.ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యబడిన వీడియోలో మెట్రో రైల్ లో ఆమె ఒక వ్యక్తి పక్కన నిలబడి అతనిని అరుస్తున్న విజువల్ ని చూడవచ్చు. అయితే వారి గొడవకు కారణం ఏమిటి అనేది స్పష్టంగా తెలియలేదు. ఆమె అతనిపై అరుస్తూనే సహనం కోల్పోయి అతనిని చెంపపై కొట్టింది. ఈ గొడవనంతటినీ అదే కంపార్ట్ మెంట్ లో ప్రయాణిస్తున్న వారెవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Telugu Panchangam: మిర్రర్ తెలుగు న్యూస్ ఈరోజు 06 జూలై 2023 తిథి, పంచాంగం.

ఈ గొడవ జరిగే సమయంలో కంపార్ట్ మెంట్ లో ఉన్న వారిలో ఒక్కరు కూడా స్పందించక పోవడం విశేషం. ఎవరికి వారు ఏమీ పట్టనట్టు గా ఫోన్ లలో బిజీగా నిమగ్నమయ్యారు.మెట్రో లో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో పై ఆన్ లైన్ లో వైరల్ గా మారి చర్చకు దారితీసింది. ఒక వ్యక్తిని ఎవరైనా బహిరంగంగా ఎలా కొడతారు అని నెటిజన్ లు ప్రశ్నిస్తున్నారు. అలాగే గొడవ ఎందుకు జరిగిందని తెలుసుకోవడం కానీ ఘర్షణను ఆపడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు. మనం ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నాం అని మరొకరు పేర్కొన్నారు.ఈ సంఘటన పై నెటిజన్ ల ప్రతిస్పందనలను చూడండి.

Leave A Reply

Your email address will not be published.